Posts

Showing posts from November, 2025

రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ

Image
  విజయవాడ: భారత రాజ్యాంగం కాపాడాలని, పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను రద్దు చేస్తూ కార్ఫోరెట్స్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన నాలుగు లేబర్ కొడ్స్ వ్యతిరేకిస్తూ విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం స్మృతి వనం వద్ద కెవిపియస్ మరియు దళిత గిరిజన ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ” రాజ్యాంగ పీఠిక పఠనం” కెవిపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగింది. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరావు పీఠిక చదివి ప్రతిజ్ఞ చేయించగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండెమెడ క్రాంతి కుమార్, అలిండియా దళిత, గిరిజన, బలహీన మైనారిటీ సంఘాల అధ్యక్షులు బందెల కిరణ్ రాజ్, జైభీమ్ భారత్ పార్టీ మహిళా నాయకులు గ్రేష మేరి, కెవిపియస్ విజయవాడ నాయకులు చింతల శ్రీనివాస్, కొసనం వర్ధన్, వరప్రసాద్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

సిఐటియు అఖిలభారత మహాసభలకు సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న

Image
సిఐటియు అఖిలభారత మహాసభలకు సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న సిఐటియు అఖిలభారత మహాసభల సందర్భంగా విశాఖలో డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు శ్రామిక్ ఉత్సవ్ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విధితమే. ఈ కార్యక్రమాలలో భాగస్వాములు కావడానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి హైదరాబాదు నగరంలో ప్రముఖ సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి సుద్దాల అశోక్ తేజ మరియు మరియు ప్రజా కవి, గాయకుడు పాటల రచయిత గోరేటి వెంకన్న లను వారి నివాసంలో కలిసి మహాసభలలో భాగస్వాములు కావాలని, కార్మికోద్యమానికి అండగా నిలవాలని కోరారు. విశాఖపట్నంలో జరిగే అఖిలభారత మహాసభల కార్యక్రమంలో తాము భాగస్వాములు అవుతామని, సాంస్కృతిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటామని కందారపు మురళికి హామీ ఇచ్చారు. అఖిలభారత మహాసభల కార్యక్రమాలలో తమను భాగస్వాములను చేయటం పట్ల వారు సిఐటియు అఖిలభారత కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు. సిఐటియు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న లకు ఫోనులో అభినందనలు తెలిపారు.

2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకూ 5 రోజుల పాటు విశాఖపట్టణంలో జరిగే సిఐటియు 18వ ఆలిండియా మహాసభలను జయప్రదం చేయండి!!

Image
సిఐటియు ఆలిండియా మహాసభల సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించిన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏ.వి. నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సి. హెచ్. నరసింగరావు, ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు, కార్యదర్శులు కె.ధనలక్ష్మి, దయా రమాదేవి, కె. ఉమామహేశ్వరావు, ఆర్.వి.నర్సింహారావు, కోశాధికారి కె. ఆర్.కె.మూర్తి. సిఐటియు ఆలిండియా 18వ మహాసభలు 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకూ 5 రోజుల పాటు విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీ, కన్వెన్షన్ సెంటర్ బీన్రోడ్డులో జరుగుతున్నాయి. ఈ ఆలిండియా మహాసభలకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ప్రతినిధులు పాల్గొంటారు. వివిధ దేశాల ట్రేడ్ యూనియన్ నాయకులు ఈ మహాసభలో పాల్గొని సౌహార్థ సందేశం ఇస్తారు. సిఐటియు 1970వ సంవత్సరంలో ఏర్పడింది. సిఐటియు ప్రారంభం నుండి చిరుద్యోగుల, కార్మికుల, ఉద్యోగుల, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నది. నిరంతరం ఉద్యోగ, కార్మిక వర్గాల కోసం పని చేస్తున్న సిఐటియు మహాసభలు జయప్రదం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వివిధ రూపాల్లో కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. జనవరి 4న ర్యాలీ, బహిరంగ సభ జరుగుతుంది. ఈ...

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం లేబర్ కోడ్లను నోటీఫై చేయడాన్ని సి.ఐ.టి.యు ఎ.పి. కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది

Image
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం లేబర్ కోడ్లను నోటీఫై చేయడాన్ని సి.ఐ.టి.యు ఎ.పి. కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. లేబర్ కోడ్లను నోటిఫై చేయటాన్ని వ్యతిరేకిస్తూ రేపు పెద్దయోత్తున రాష్ట్ర వ్యాపితంగా నోటిఫై చేసిన ఉత్తర్వులను ధగ్ధం చేసి నిరసన తెలియచేయాలని కార్మికులకు, కార్మికసంఘాల నాయకులుక సి.ఐ.టి.యు పిలుపునిస్తున్నది. పెట్టుబడుదారుల ప్రయోజనాలను కాపాడటానికి మాత్రమే బిజెపి ప్రభుత్వం పనిచేస్తున్నదని మరోసారి తేటతెల్లమైంది. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ల ప్రయోజనం కోసం 4 లేబర్ కోడ్లను తెచ్చింది. బిహార్ ఎన్నికల అనంతరం నోటిఫై చేయటం ద్వారా తన కుటిలత్వాన్ని బయటపెట్టుకుంది. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై, లేబర్ కోడ్లు రద్దుకు భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని సి.ఐ.టి.యు రాష్ట్ర కమిటీ కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నది. సిహెచ్ నరసింగరావు ప్రధాన కార్యదర్శి ఎ.వి. నాగేశ్వరరావు అధ్యక్షులు  #CITU #LabourCodes #4LabourCodes #BJP #TDP #YCP #Janasena #CPM #CPI #Congress #CITUAndhraPradesh 

కార్మిక, రైతు, కూలీల ద్రోహి సిఎం

Image
సిఎం చంద్రబాబు పై కార్మిక సంఘాల మండిపాటు 26న జిల్లా కేంద్రాల్లో నిరసన, ప్రదర్శనలకు పిలుపు విజయవాడ: కార్మికుల, రైతుల, వ్యవసాయకూలీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్రోహం చేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు సంయుక్తంగా రాష్ట్ర స్థాయి నాయకత్వ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్శింగ్ రావు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ఫ్లాంట్ కార్మికులనుద్ధేశించి సిఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. ఫ్లాంట్ ని వైట్ ఎలిఫెంట్ అని, కార్మికులు పనిచేయని దొంగలని, వారిపై పిడి యాక్ట్ లు పెడతానని హెచ్చరించటం సిఎం కి సహేతుకం కాదని తప్పు పట్టారు. కార్మిక ద్రోహులు, అధికారమదంతో ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ప్రైవేటీకరణకు వ్యతిరేకమని, అధికారం అధిష్టానం పీఠం ఎక్కినాకా బోడి మల్లయ్య చందంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రాంపల్లి రవీంద్ర నాథ్ మాట్లాడుతూ ఉద్యోగ, కార్మికులకు పనిగంటలను పెంపుదల చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేక...

ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) నూతన రాష్ట్ర కమిటీ

Image
అధ్యక్ష–ప్రధానకార్యదర్శులుగా కె.నాగభూషణం - కె.ఉమామహేశ్వర రావు - 21 మంది ఆఫీస్ బేరర్స్ ఎన్నిక - మరో 50 మందితో రాష్ట్ర కమిటీ. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా కె నాగభూషణం, కె ఉమామహేశ్వరరావు తిరిగి ఎన్నికయ్యారు.మునిసిపల్  వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 15వ రాష్ట్ర మహాసభలు ఒంగోలు కొత్త మార్కెట్ వద్ద  జి.సుబ్బారావు నగర్‌లో నవంబర్ 15–16 తేదీల్లో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు మున్సిపల్ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర చర్చలు జరిపిన ఈ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభలకు తొలి రోజు ఎంఎల్ సి బి గోపిమూర్తి, నిన్న ఈ రోజు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ముఖ్య అతిధులు గా హాజరై శ్రేణులకు దశ, దిశా నిర్దేశం చేశారు. కాగా ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, ఎ పి మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు, ఎపి మధ్యాహ్న భోజన పధక కార్మికుల యూనియన్, కెవిపిఎస్ యూనియన్ రాష్ట్ర నాయకులు పి కల్పన, బి రఘురామ్ స...

రైల్వే గార్డులు (ట్రైన్ మేనేజర్స్) యొక్క సమస్యల పరిష్కారానికై ఆలిండియా గార్డ్స్ కౌన్సిల్ చేపడుతున్న పోరాటాలకు సిఐటియు మద్దతు

Image
ఆలిండియా రైల్వేగార్డ్స్ కౌన్సిల్ (ట్రైన్ మేనేజర్స్) యొక్క డిమాండ్స్ సాధనకై ఆలిండియా పిలుపు మేరకు ఎఐజిసి - విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో తేది 12.11.2025 న విజయవాడ రైల్వే డిఆర్ఎం ఆఫీసు వద్ద జరిగిన ధర్నాలో వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జరుగుతున్న ఆందోళన- పోరాటాలకు సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ (సిఐటియు) సంపూర్ణమద్దతు ఇస్తుందని శ్రీ వి.వి.ఎల్ నరసింహులు (సిఐటియు) ఎపి కమిటి రాష్ట్ర కమిటి సభ్యులు పేర్కొన్నారు. ఎఐజిసి నిర్వహించిన ధర్నాలో శ్రీ నరసింహులు మాట్లాడుతూ నేడు కేంద్రంలో ఉన్న బిజేపి ప్రభుత్వ సరళీకరణ విధానాల అమలు వల్ల రైల్వేలు ప్రైయివేటీకరించబడుతున్నవని, సిబ్బంది సంఖ్యను తగ్గించబడుతున్నదని నేడు రైల్వేలో సేఫ్టీ క్యాటగిరీస్ అయిన లోకో, గార్డ్స్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్, ఆపరేటింగ్, ఇంజనీరింగ్ తదితర సెక్షన్స్తో పాటు అన్ని విభాగాల్లో 3 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్న నింపటంలేదని, ఫలితంగా ఉన్న వారిపై పనిభారం, మానసిక ఒత్తిడి పెరిగిందని, అన్నారు. వేరొక ప్రక్క (ట్రైన్ మేనేజర్స్కి 1.1.2024 నుండి డిఎ 50 శాతం దాటినా వారి మైలేజి ఎలవెన్స్లు పెంచలేదని, అలాగే పాత పెన్షన్ విధానం (ఓపిఎస్)ను పునరుద్దరించకుంండా కార...

సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు

Image
అనంతపురం:  హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గమని, అప్పుడే ప్రభుత్వాలు స్పందిస్తాయని సివిల్‌ సప్లరు హామాలీ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సప్లయ్ హమాలీ యూనియన్‌ ఐదవ రాష్ట్ర మహాసభ అనంతపురం జిల్లా కేంద్రంలోని గణేనాయక్‌ భవన్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. సీతారాం ఏచూరి ప్రాంగణంలో సిఐటియు జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.కృష్ణ అధ్యక్షతన ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా గేయానంద్‌, ఆ సంఘం గౌరవాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. తొలుత అమరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా మహాసభ నివాళులర్పించింది. మూడు సంవత్సరాల్లో సంఘం ఆధ్వర్యంలో హమాలీల పక్షాన చేసిన పోరాటాలు, సాధించిన హక్కులు తదితర అంశాలపై ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరరావు నివేదిక ప్రవేశపెట్టారు. గేయానంద్‌, కె.ఉమామహేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మాట్లాడుతూ… సివిల్‌ సప్లరు హమాలీల శ్రమకు తగ్గ వేతనం అందడం లేదన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత క...

పారిశ్రామిక సమ్మిట్‌ పేరిట కార్పొరేట్లకు వరాలు.. కార్మికులపై భారాలా ?

Image
విశాఖలో ఎపి లేబర్‌ సమ్మిట్‌ – 2025 విశాఖ :  పారిశ్రామిక సమ్మిట్‌ పేరిట కార్పొరేట్లకు వరాలు అందిస్తూ కార్మికులపై భారాలు మోపు తున్నారని పలువురు వక్తలు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులంతా ఐక్యమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరుగుతున్న పారిశ్రామికవేత్తల సమ్మిట్‌కు ప్రత్యామ్నాయంగా సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, సిఐటియు అఖిల భారత మహాసభ సందర్భంగా మంగళవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ‘ఆంధ్రప్రదేశ్‌ లేబర్‌ సమ్మిట్‌- 2025’ పేరిట సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ద్రవిడ యూనివర్సిటీ పూర్వ వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కెఎస్‌.చలం మాట్లాడుతూ… రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. అందువల్ల దేశంలోని వివిధ సంస్థలలో పనిచేస్తున్న 31 కోట్ల మంది కార్మికులకు ఎటువంటి రక్షణ, భద్రత లేకుండా పోయిందన్నారు. కర్మాగారాల్లో పని చేసే వారు మాత్రమే కార్మికులు కాదని, శ్రమను నమ్ముకొని పనిచేస్తూ, మానవ వనరుల అభివృద్ధికి దోహదపడే వారంతా కార్మికులేనని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వ...