Skip to main content

కార్మిక, రైతు, కూలీల ద్రోహి సిఎం

సిఎం చంద్రబాబు పై కార్మిక సంఘాల మండిపాటు
26న జిల్లా కేంద్రాల్లో నిరసన, ప్రదర్శనలకు పిలుపు

విజయవాడ: కార్మికుల, రైతుల, వ్యవసాయకూలీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్రోహం చేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు సంయుక్తంగా రాష్ట్ర స్థాయి నాయకత్వ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్శింగ్ రావు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ఫ్లాంట్ కార్మికులనుద్ధేశించి సిఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. ఫ్లాంట్ ని వైట్ ఎలిఫెంట్ అని, కార్మికులు పనిచేయని దొంగలని, వారిపై పిడి యాక్ట్ లు పెడతానని హెచ్చరించటం సిఎం కి సహేతుకం కాదని తప్పు పట్టారు. కార్మిక ద్రోహులు, అధికారమదంతో ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ప్రైవేటీకరణకు వ్యతిరేకమని, అధికారం అధిష్టానం పీఠం ఎక్కినాకా బోడి మల్లయ్య చందంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రాంపల్లి రవీంద్ర నాథ్ మాట్లాడుతూ ఉద్యోగ, కార్మికులకు పనిగంటలను పెంపుదల చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పోరాడిసాధింంచిన కార్మిక హక్కులను, చట్టాలను తుంగలో తొక్కుతున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ కార్పొరేట్ అనుకూల, రైతు, కార్మిక, కూలీల వ్యతిరేక విధానాలు అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని విమర్శించారు. పారిశ్రామిక రంగంలో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కొడ్స్, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 26న జరిగే జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన లు, జిల్లా కలెక్టర్ లకు డిమాండ్ లతో కూడిన వినతిపత్రాలు అందజేయాలని పిలుపు నిచ్చారు. మాజీ మంత్రి, ఏపి రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ బడా కార్పొరేట్ కంపెనీలకు రాష్ట్ర వనరులను పప్పుబెల్లం వలె పంచుతున్నారని, సిఎం చంద్రబాబు పై మండిపడ్డారు. చంద్రబాబు అధికారం కైవసం చేసుకున్న తొలిరోజుల నుండి అన్ని రంగాలను ప్రైవేటీకరణకే పెద్దపీఠ వేసి, ప్రభుత్వ రంగాన్ని నాశనం చేశారని విమర్శించారు. వ్యవసాయం దండగా అంటూ దుంపనాశనం చేశారని ఏద్ధేవా చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ తానా అంటే తందానా అంటూ డు..డు.. బసవన్నలాగా తయారయ్యడని దుయ్యబట్టారు. ప్రజా పోరాటాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలని కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు పిలుపునిచ్చారు. రైతు సంఘం నాయకులు వై. కేశవరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన మార్కేట్ విధానం, నూతన విత్తన చట్టం, విద్యుత్ సంస్కరణల పేరుతో రైతులను, కూలీలను, కార్మికులకు ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి సి ఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ, ఏఐకెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు యం. వెంకటరెడ్డి, ఐఎఫ్ టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. రామకృష్ణ, సిఐటియు రాష్ట్ర నాయకులు వెంకటసుబ్బమ్మ, ఏఐయుటియుసి రాష్ట్ర అధ్యక్షులు సుధీర్, యుటియుసి రాష్ట్ర అధ్యక్షులు జూపల్లి జానకీరాములు, టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్ బాబు, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చలసాని రామారావు, ఉపాధ్యక్షులు కృష్ణ మూర్తి, నగర అధ్యక్షులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, ఏఐసిటియు రాష్ట్ర నాయకులు లక్ష్మి నారాయణ, ఏఐకెఎఫ్ రాష్ట్ర నాయకులు కాసాని గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) నూతన రాష్ట్ర కమిటీ

అధ్యక్ష–ప్రధానకార్యదర్శులుగా కె.నాగభూషణం - కె.ఉమామహేశ్వర రావు - 21 మంది ఆఫీస్ బేరర్స్ ఎన్నిక - మరో 50 మందితో రాష్ట్ర కమిటీ. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా కె నాగభూషణం, కె ఉమామహేశ్వరరావు తిరిగి ఎన్నికయ్యారు.మునిసిపల్  వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 15వ రాష్ట్ర మహాసభలు ఒంగోలు కొత్త మార్కెట్ వద్ద  జి.సుబ్బారావు నగర్‌లో నవంబర్ 15–16 తేదీల్లో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు మున్సిపల్ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర చర్చలు జరిపిన ఈ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభలకు తొలి రోజు ఎంఎల్ సి బి గోపిమూర్తి, నిన్న ఈ రోజు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ముఖ్య అతిధులు గా హాజరై శ్రేణులకు దశ, దిశా నిర్దేశం చేశారు. కాగా ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, ఎ పి మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు, ఎపి మధ్యాహ్న భోజన పధక కార్మికుల యూనియన్, కెవిపిఎస్ యూనియన్ రాష్ట్ర నాయకులు పి కల్పన, బి రఘురామ్ స...

సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు

అనంతపురం:  హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గమని, అప్పుడే ప్రభుత్వాలు స్పందిస్తాయని సివిల్‌ సప్లరు హామాలీ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సప్లయ్ హమాలీ యూనియన్‌ ఐదవ రాష్ట్ర మహాసభ అనంతపురం జిల్లా కేంద్రంలోని గణేనాయక్‌ భవన్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. సీతారాం ఏచూరి ప్రాంగణంలో సిఐటియు జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.కృష్ణ అధ్యక్షతన ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా గేయానంద్‌, ఆ సంఘం గౌరవాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. తొలుత అమరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా మహాసభ నివాళులర్పించింది. మూడు సంవత్సరాల్లో సంఘం ఆధ్వర్యంలో హమాలీల పక్షాన చేసిన పోరాటాలు, సాధించిన హక్కులు తదితర అంశాలపై ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరరావు నివేదిక ప్రవేశపెట్టారు. గేయానంద్‌, కె.ఉమామహేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మాట్లాడుతూ… సివిల్‌ సప్లరు హమాలీల శ్రమకు తగ్గ వేతనం అందడం లేదన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత క...

సెల్ఫ్ వీడియోలతో వినూత్న రీతిలో సిఐటియు అఖిలభారత మహాసభల కోసం ప్రచారం

సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు అనుబంధ సంఘమైన ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెల్ఫ్ వీడియోలతో వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో మహాసభలు కోసం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సిఐటియు అఖిలభారత మహాసభలకు 1,300 మంది ప్రతినిధులు హాజరై పాల్గొంటారు. అందులో ఆశా వర్కర్ వర్కర్స్ యూనియన్ నుండి కూడా ప్రతినిధులు దేశ నలుమూలల నుండి ఈ మహాసభకు వస్తున్నారు. ఇప్పటికే సిఐటియు అనేక కార్మిక సమస్యల కోసం పోరాడటమే కాకుండా ఆశా వర్కర్ల సమస్యలపై కూడా నిరంతరం పోరాటం చేస్తుంది. మన రాష్ట్రంలో ఇప్పటికీ ఆశా వర్కర్ల జీతం 10,000 కు మించడం లేదు. ఒక్కరోజు కూడా సెలవు లేకుండా పనిచేస్తున్న కార్మికులు ఎవరైనా ఉన్నారంటే వారు ఆశా వర్కర్లు మాత్రమే. వీరికి హెల్త్ ఇన్సూరెన్స్ లేవు. అన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఇలాంటి అనేక సమస్యల పైన ఈ మహాసభలు చర్చించి భవిష్యత్తు పోరాటాలకు దిశా ...