తేదీ : 28.04.2026 ప్రచురణ / ప్రచురణార్ధం : 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ను అమలు చేయాలి మహిళా రిజర్వేషన్ అమలుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో మంగళవారం కా॥ కె.ధనలక్ష్మి అధ్యక్షతన విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, ప్రజా ప్రతినిధులకు రాయభారాలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.సుu్బరావమ్మ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2023 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిందని ఆమె గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం దేశవ్యాప్తంగా మహిళలందరూ సుదీర్ఘకాలం పోరాడారని వామపక్ష పార్టీల ఎంపీలు పార్టీ పార్లమెంట్లో గళమెత్తి నినదించారని ఆమె చెప్పారు. ఈ తీర్మానంపై హాజరైన నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుచేసే చిత్తశుద్ధి మోడీ ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించార...
Official account of the Centre of Indian Trade Unions (CITU), Andhra Pradesh State Committee.