Skip to main content

Posts

సామాజిక శంఖారావం అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను పరిష్కరించాలి

సామాజిక శంఖారావం అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను పరిష్కరించాలి మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి సామాజిక శంఖారావం బృందం వినతి అమరావతి: “సామాజిక శంఖారావం – కులవివక్ష లేని సమాజం కోసం” నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సామాజిక శంఖారావం ప్రతినిధి బృందం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిని మంగళవారం కలిసి రాష్ట్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 380 మండలాలు, 1,243 గ్రామాలు, 63 పట్టణాలు, 236 వార్డుల్లో నిర్వహించిన అధ్యయన యాత్రల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ అధ్యయనంలో 660 స్మశాన వాటిక సమస్యలు, 405 ఇళ్ల స్థలాల సమస్యలు, 302 భూ సంబంధిత సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. స్మశాన వాటికలకు శాశ్వత పరిష్కారం అధ్యయన యాత్రల్లో అత్యధికంగా వెలుగులోకి వచ్చిన సమస్య స్మశాన వాటికలేనని ప్రతినిధులు తెలిపారు. అనేక దళితవాడల్లో ప్రత్యేక స్మశాన స్థలాలు లేకపోవడ...
Recent posts

స్టీల్‌ప్లాంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫ్యాక్టరీ డైరెక్టర్‌ను కోరిన సిఐటియు

విశాఖస్టీల్ ప్లాంట్‌లో జూన్ 8 న జరిగిన ప్రమాదానికి బాధ్యులైన స్టీల్‌ప్లాంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మంగళవారం (23.06.2026)న ఫ్యాక్టరీ డైరెక్టర్‌ను కలసి సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు మరణించారు. ఈ ఘటనపై ఉక్కు మంత్రిత్వ శాఖ ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది, కానీ ఇప్పటివరకు ఎలాంటి నివేదిక ప్రకటించలేదు. ఫ్యాక్టరీల శాఖ కూడా ఈ ప్రమాదానికి గల కారణాలను నేటికీ వెల్లడించకపోవడం అన్యాయం. యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని ట్రేడ్ యూనియన్లు మరియు కార్మికులు నిస్సందేహంగా ప్రకటించారు. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఇనుప ద్రావణం ఉండే లాడిల్‌కు కనీసం కవర్‌ను కూడా ఉపయోగించలేదు. విధి విధానాల ప్రకారం ప్రమాదానికి ఆస్కారం ఉండే ప్రతీ డిపార్ట్‌మెంట్‌లో అంబులెన్స్‌లు ఉండాలి. ప్రమాదం జరిగిన రోజున ఎసఎంఎస్`1 వద్ద అంబులెన్స్ కూడా లేదు. తక్షణ చికిత్స కోసం =IచీL ఆసుపత్రిలో కాలిన గాయాలకు చికిత్స చేసే యూనిట్ పనిచేయడం లేదు. భద్రతపై 1.12.2025న ఫ్యాక్టరీల జాయింట్ డైరెక్టర్ జారీ చేసిన మెరుగుదల నోటీసునిచ్చినా యాజమాన్యం పట్టించుకోలే...

ఉద్యోగుల, కార్మికుల వేతన పెంపు తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ తిరిగి కొనసాగించవచ్చంటూ నిన్న సర్క్యులర్ మెమోను జారీ చేసింది. ఈ సర్క్యులర్ మెమోను జారీ చేయడానికి కూటమి ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీఓ 114, ది. 21.10.2023 ప్రకారం రెగ్యులర్ కాకుండా మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ వెంటనే రెగ్యులర్ చేయాలని సిఐటియు ఏపి కమిటీ కోరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్లే ఈ ఉద్యోగులు రెగ్యులరైజ్ కానందు వల్ల వారికి అప్పటి నుండి ఎరియర్స్‌ను చెల్లించాలని, సర్వీసు కాలాన్ని పరిగణించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. అభివృద్ధి పేరిట పెట్టుబడిదారులకు ప్రయోజనాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న ఉత్సాహం ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలను కొనసాగించడంలో చూపించడం లేదు. కార్మికుల పనిగంటలు పెంచడం, పని విస్తృతి పెంచడం, మహిళల చేత రాత్రిపూట పని చేయించడం వంటి కార్మిక చట్టాల మార్పులను కూటమి ప్రభుత్వం ఆఘ మేఘాల మీద చేసింది. పెట్టుబడిదారులకు ప్రయోజనాలు కల్పించడంలో చూపిన వేగం 3 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మినిమం టైమ్‌స్కేల్ అమలు చేయడంలో చూపడ...

రాష్ట్రంలో కనీస వేతనాలు వెంటనే పెంచాలి

50 లక్షల మంది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 2006 - 07 తర్వాత కనీస వేతనాలను పెంచలేదు. ఐదు సంవత్సరాýకోసారి కనీస వేతనాల చట్టం ప్రకారం వేతనాలు పెంచాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను పెంచితే యాజమాన్యాలకు లాభాలు తగ్గిపోతాయని కనీస వేతనాలను పెంచలేదు. షెడ్యూల్డ్ పరిశ్రమల్లోని కార్మికులకు కోట్లాది రూపాయలు నష్టం కలిగించింది. 2012, 2017, 2022లో కనీస వేతనాలను పెంచకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారుల ప్రయోజనం కోసమే పని చేశాయి. మన పక్కనే ఉన్న తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలు ఐదు సంవత్సరాల కోసారి వేతనాలు పెంచుతున్నాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి కార్మికుల ప్రయోజనం పట్టదు. ఎప్పుడు కూడా పెట్టుబడిదారులకు ఏమి లబ్ది చేకూర్చాలని మాత్రమే ఆలోచిస్తున్నది. ఐదు సంవత్సరాలకోసారి వేతనాలు పెంచినట్లయితే కనీస స్థాయిలో ఈ పాటికి రూ. 19 వేల నుండి రూ. 22 వేల వరకూ వచ్చి ఉండేవి. నైపుణ్య స్థాయిని బట్టి మరింతగా వేతనాలు పెరిగి ఉండేవి. మన పక్కనే ఉన్న తెలంగాణా రాష్ట్రం కూడా వేతనాలను అరకొరగా రూ. 14 వేల నుండి రూ. 20 వేల వరకు పెంచింది. కర్నాటక ప్రభుత్వం మే 23న పెంచిన వేతనాల స్థాయి సంతృప్తికరంగా ఉంది. అక్కడ...

వైద్య మిత్రాల జీతాలు వెంటనే చెల్లించాలి.వైద్య మిత్రాల జీతాలు వెంటనే చెల్లించాలి.

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో వైద్యమిత్రాలు టీం లీడర్లు మరియు డిస్ట్రిక్ మేనేజర్లు కలిపి మొత్తం 2000 మంది సిబ్బందపనిచేస్తున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న వీరికి మార్చి నుండి జీతాలు చెల్లించలేదు. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు ఎపి కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. 18 సంవత్సరాల నుండి వీరు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. ఆ జీతాలు నెల నెలా రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలను అధికారులు దృష్టికి ఫోన్ ద్వారా తెలియజేసిన బడ్జెట్ రాలేదని సాకులు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, తక్షణమే స్పందించి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న వైద్యమిత్రాల జీతాలు వెంటనే చెల్లించాలని సిఐటియు ఎపి కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.

2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలి

తేదీ : 28.04.2026 ప్రచురణ / ప్రచురణార్ధం : 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలి మహిళా రిజర్వేషన్ అమలుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో మంగళవారం కా॥ కె.ధనలక్ష్మి అధ్యక్షతన విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, ప్రజా ప్రతినిధులకు రాయభారాలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.సుu్బరావమ్మ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2023 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిందని ఆమె గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం దేశవ్యాప్తంగా మహిళలందరూ సుదీర్ఘకాలం పోరాడారని వామపక్ష పార్టీల ఎంపీలు పార్టీ పార్లమెంట్‌లో గళమెత్తి నినదించారని ఆమె చెప్పారు. ఈ తీర్మానంపై హాజరైన నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుచేసే చిత్తశుద్ధి మోడీ ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించార...

కడియం ఎపి పేపర్ మిల్లు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు సిఐటియు మద్దతు

తేదీ : 28.04.2026 ప్రచురణ / ప్రచురణార్ధం : కడియం ఎపి పేపర్ మిల్లు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు సిఐటియు మద్దతు వేతనాలు పెంచాలని, పర్మినెంట్ చెయ్యాలని కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు కడియం యూనిట్‌లో సుమారు 15 నుండి 20 ఏళ్లుగా పనిచేస్తున్న 850 మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ వేతనాల పెంపు మరియు ఇతర డిమాండ్ పై ఏప్రిల్ 28న ఉదయం నుండి సమ్మె చేస్తున్నారు. గత ఒప్పందం 2023 జూన్ 30తో ముగిసినప్పటికీ, యాజమాన్యం నూతన ఒప్పందం చేయడానికి నిరాకరించింది. యÖనియన్ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఇచ్చినందుకు కక్షతో యÖనియన్ నాయకులకు షోకాజ్ నోటీసులిచ్చి యÖనియన్ నాయకత్వాన్ని రెచ్చగొట్టింది. రోజువారీ వేతనాన్ని రూ.300 మేర పెంచాలని, సీనియార్టీ ప్రాతిపదికన కార్మికులను పర్మినెంట్ చేయాలని, కార్మికులకు 20% బోనస్ మరియు 22% ప్రొడక్షన్ బోనస్ కల్పించాలని కోరారు. వారాంతపు సెలవులకు వేతనం ఇవ్వాలని, ఓవర్ టైంకు డబుల్ వేతనం ఇవ్వాలని, క్యాంటీన్ ధరలను తగ్గించడంతో పాటు, మహిళా కార్మికుల కోసం ప్రత్యేక వాష్ రూమ్ కల్పించాలని డిమాండ్స్ ఇచ్చారు. లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల హక్కులు ప...