సామాజిక శంఖారావం అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను పరిష్కరించాలి మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి సామాజిక శంఖారావం బృందం వినతి అమరావతి: “సామాజిక శంఖారావం – కులవివక్ష లేని సమాజం కోసం” నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సామాజిక శంఖారావం ప్రతినిధి బృందం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిని మంగళవారం కలిసి రాష్ట్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 380 మండలాలు, 1,243 గ్రామాలు, 63 పట్టణాలు, 236 వార్డుల్లో నిర్వహించిన అధ్యయన యాత్రల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ అధ్యయనంలో 660 స్మశాన వాటిక సమస్యలు, 405 ఇళ్ల స్థలాల సమస్యలు, 302 భూ సంబంధిత సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. స్మశాన వాటికలకు శాశ్వత పరిష్కారం అధ్యయన యాత్రల్లో అత్యధికంగా వెలుగులోకి వచ్చిన సమస్య స్మశాన వాటికలేనని ప్రతినిధులు తెలిపారు. అనేక దళితవాడల్లో ప్రత్యేక స్మశాన స్థలాలు లేకపోవడ...
విశాఖస్టీల్ ప్లాంట్లో జూన్ 8 న జరిగిన ప్రమాదానికి బాధ్యులైన స్టీల్ప్లాంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మంగళవారం (23.06.2026)న ఫ్యాక్టరీ డైరెక్టర్ను కలసి సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డిమాండ్ చేశారు. స్టీల్ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు మరణించారు. ఈ ఘటనపై ఉక్కు మంత్రిత్వ శాఖ ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది, కానీ ఇప్పటివరకు ఎలాంటి నివేదిక ప్రకటించలేదు. ఫ్యాక్టరీల శాఖ కూడా ఈ ప్రమాదానికి గల కారణాలను నేటికీ వెల్లడించకపోవడం అన్యాయం. యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని ట్రేడ్ యూనియన్లు మరియు కార్మికులు నిస్సందేహంగా ప్రకటించారు. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఇనుప ద్రావణం ఉండే లాడిల్కు కనీసం కవర్ను కూడా ఉపయోగించలేదు. విధి విధానాల ప్రకారం ప్రమాదానికి ఆస్కారం ఉండే ప్రతీ డిపార్ట్మెంట్లో అంబులెన్స్లు ఉండాలి. ప్రమాదం జరిగిన రోజున ఎసఎంఎస్`1 వద్ద అంబులెన్స్ కూడా లేదు. తక్షణ చికిత్స కోసం =IచీL ఆసుపత్రిలో కాలిన గాయాలకు చికిత్స చేసే యూనిట్ పనిచేయడం లేదు. భద్రతపై 1.12.2025న ఫ్యాక్టరీల జాయింట్ డైరెక్టర్ జారీ చేసిన మెరుగుదల నోటీసునిచ్చినా యాజమాన్యం పట్టించుకోలే...