Posts

సిఐటియు రాష్ట్ర కేంద్రంలో కారల్‌మార్క్స్ 143వ వర్ధంతి

Image
కార్మికవర్గ సిద్ధాంతకర్త, ప్రపంచ మానవాళి కళ్యాణానికి మార్గ దర్శకుడు కారల్‌మార్క్స్ 143వ, వర్ధంతి కార్యక్రమం సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారల్‌మార్క్స్ చిత్ర పటాఇకి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజయకుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు అధ్యక్షతన నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రపంచ మానవాళి విముక్తి సోషలిజం ద్వారానే సాధ్యమని నిరూపించిన మహా మేధావి కారల్‌మార్క్స్ అని సిఐటియు నాయకులు కొనియాడారు. ప్రస్తుతం అమెరికా సామ్రాజ్యవాదం బరితెగించి ఇజ్రాయెల్‌తో కలిపి ఇరాన్‌పై దాడి చేయడం దుర్మార్గ పూరితమని నాయకులు విమర్శించారు. ప్రపంచవ్యాపితంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని, దీని మూలంగా చమురు ధరలు పైకి ఎగబాకుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మానవాళి సమస్యలకు పెట్టుబడిదారీ విధానం పరిష్కారం చూపలేదని సోషలిజం ద్వారానే అది సాధ్యపడుతుందని చెప్పిన మహానీయుడు కారల్‌మార్క్స్ ఆశయ సాధనకు కార్మికవర్గం అంకితం కావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు కె.సుబ్బరావమ్మ, కె.ధనలక్ష్మి, ము...
Image
రాష్ట్ర ప్రభుత్వం షాపులు మరియు సంస్థలకు సంబంధించి రెండు జీఓలు జారీ చేసింది. ఈ జీఓలు వీటిలో పనిచేసే కార్మికులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కూటమి ప్రభుత్వం ఇటువంటి ముఖ్యమైన సమస్యపై కనీసం కార్మిక సంఘాలతో కూడా చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించింది. ఇప్పటికే షాపులు మరియు సంస్థలలో పనిచేసే కార్మికుల పనిగంటలను 8 నుండి 10కి పెంచింది. అదే సమయంలో వారానికి 48 గంటలు పనిచేస్తే సరిపోతుందన్నది. కానీ 10 గంటలు పనిచేస్తే అదనంగా ఒకరోజు సెలవు వస్తుందని మాత్రం ఎక్కడా చెప్పలేదు. కొద్ది కాలంలోనే ఇప్పుడు మరో జీఓ జారీ చేసి షాపులు, సంస్థలను యజమానులు ప్రతిరోజూ 24 గంటలు తెరిచి ఉంచవచ్చని, కార్మికులతో పనిచేయించుకోవచ్చని చెప్పింది. కానీ పని వారానికి 48 గంటలు మాత్రమేనని మళ్లీ ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడింది. వారానికి 48 గంటలు మించితే ఓవర్‌టైమ్ ఇవ్వాలని చెప్పింది. కానీ ఇప్పటికే రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. షాపుల్లో కార్మికులు రోజుకు 8 గంటలకు మించిన పని కాలానికి డబుల్ ఓటీ లేకుండా 10 నుండి 12 గంటలు పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, లేబర్ అధికారులు దీన్ని చూసి చూడనట్లు నటిస్తున్నారు. 24 ...

లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మిక వర్గం ఐక్య పోరాటాలు చేయాలి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ వి.గోపాల్ గౌడ పిలుపు

Image
రాజ్యాంగ విరుద్ధమైన, కార్మిక వర్గానికి నష్ట దాయకమైన లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా ఆందోళనలు చేపట్టాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.గోపాల్ గౌడ సందేశమిచ్చారు. ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. డిసెంబర్ 13న విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సిఐటియు అఖిలభారత మహాసభల సందర్భంగా సిఐటియు-ఎంబివికే ఆధ్వర్యంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సులో జస్టిస్ గోపాల్ గౌడ ప్రసంగిస్తూ వంద సంవత్సరాల క్రితం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను పెట్టుబడి దారులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు బేర సారాలు ఆడే హక్కు లేకుండా లేబర్ కోడ్స్ తయారు చేశారని అన్నారు. కార్మికులకు ఎటువంటి పని, సామాజిక భద్రత భవిష్యత్తులో ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు కార్పొరేట్ల సేవలో తరిస్తున్నాయన్నారు. జాతీయ కనీస వేతనం రూ. 178/- రోజుకి ఎలా సరిపోతుందన్నారు. పెరుగుతున్న ధరల...

సెల్ఫ్ వీడియోలతో వినూత్న రీతిలో సిఐటియు అఖిలభారత మహాసభల కోసం ప్రచారం

Image
సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు అనుబంధ సంఘమైన ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెల్ఫ్ వీడియోలతో వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో మహాసభలు కోసం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సిఐటియు అఖిలభారత మహాసభలకు 1,300 మంది ప్రతినిధులు హాజరై పాల్గొంటారు. అందులో ఆశా వర్కర్ వర్కర్స్ యూనియన్ నుండి కూడా ప్రతినిధులు దేశ నలుమూలల నుండి ఈ మహాసభకు వస్తున్నారు. ఇప్పటికే సిఐటియు అనేక కార్మిక సమస్యల కోసం పోరాడటమే కాకుండా ఆశా వర్కర్ల సమస్యలపై కూడా నిరంతరం పోరాటం చేస్తుంది. మన రాష్ట్రంలో ఇప్పటికీ ఆశా వర్కర్ల జీతం 10,000 కు మించడం లేదు. ఒక్కరోజు కూడా సెలవు లేకుండా పనిచేస్తున్న కార్మికులు ఎవరైనా ఉన్నారంటే వారు ఆశా వర్కర్లు మాత్రమే. వీరికి హెల్త్ ఇన్సూరెన్స్ లేవు. అన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఇలాంటి అనేక సమస్యల పైన ఈ మహాసభలు చర్చించి భవిష్యత్తు పోరాటాలకు దిశా ...

రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ

Image
  విజయవాడ: భారత రాజ్యాంగం కాపాడాలని, పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను రద్దు చేస్తూ కార్ఫోరెట్స్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన నాలుగు లేబర్ కొడ్స్ వ్యతిరేకిస్తూ విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం స్మృతి వనం వద్ద కెవిపియస్ మరియు దళిత గిరిజన ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ” రాజ్యాంగ పీఠిక పఠనం” కెవిపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగింది. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరావు పీఠిక చదివి ప్రతిజ్ఞ చేయించగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండెమెడ క్రాంతి కుమార్, అలిండియా దళిత, గిరిజన, బలహీన మైనారిటీ సంఘాల అధ్యక్షులు బందెల కిరణ్ రాజ్, జైభీమ్ భారత్ పార్టీ మహిళా నాయకులు గ్రేష మేరి, కెవిపియస్ విజయవాడ నాయకులు చింతల శ్రీనివాస్, కొసనం వర్ధన్, వరప్రసాద్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

సిఐటియు అఖిలభారత మహాసభలకు సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న

Image
సిఐటియు అఖిలభారత మహాసభలకు సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న సిఐటియు అఖిలభారత మహాసభల సందర్భంగా విశాఖలో డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు శ్రామిక్ ఉత్సవ్ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విధితమే. ఈ కార్యక్రమాలలో భాగస్వాములు కావడానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి హైదరాబాదు నగరంలో ప్రముఖ సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి సుద్దాల అశోక్ తేజ మరియు మరియు ప్రజా కవి, గాయకుడు పాటల రచయిత గోరేటి వెంకన్న లను వారి నివాసంలో కలిసి మహాసభలలో భాగస్వాములు కావాలని, కార్మికోద్యమానికి అండగా నిలవాలని కోరారు. విశాఖపట్నంలో జరిగే అఖిలభారత మహాసభల కార్యక్రమంలో తాము భాగస్వాములు అవుతామని, సాంస్కృతిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటామని కందారపు మురళికి హామీ ఇచ్చారు. అఖిలభారత మహాసభల కార్యక్రమాలలో తమను భాగస్వాములను చేయటం పట్ల వారు సిఐటియు అఖిలభారత కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు. సిఐటియు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న లకు ఫోనులో అభినందనలు తెలిపారు.