Skip to main content

Posts

రాష్ట్రంలో కనీస వేతనాలు వెంటనే పెంచాలి

50 లక్షల మంది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 2006 - 07 తర్వాత కనీస వేతనాలను పెంచలేదు. ఐదు సంవత్సరాýకోసారి కనీస వేతనాల చట్టం ప్రకారం వేతనాలు పెంచాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను పెంచితే యాజమాన్యాలకు లాభాలు తగ్గిపోతాయని కనీస వేతనాలను పెంచలేదు. షెడ్యూల్డ్ పరిశ్రమల్లోని కార్మికులకు కోట్లాది రూపాయలు నష్టం కలిగించింది. 2012, 2017, 2022లో కనీస వేతనాలను పెంచకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారుల ప్రయోజనం కోసమే పని చేశాయి. మన పక్కనే ఉన్న తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలు ఐదు సంవత్సరాల కోసారి వేతనాలు పెంచుతున్నాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి కార్మికుల ప్రయోజనం పట్టదు. ఎప్పుడు కూడా పెట్టుబడిదారులకు ఏమి లబ్ది చేకూర్చాలని మాత్రమే ఆలోచిస్తున్నది. ఐదు సంవత్సరాలకోసారి వేతనాలు పెంచినట్లయితే కనీస స్థాయిలో ఈ పాటికి రూ. 19 వేల నుండి రూ. 22 వేల వరకూ వచ్చి ఉండేవి. నైపుణ్య స్థాయిని బట్టి మరింతగా వేతనాలు పెరిగి ఉండేవి. మన పక్కనే ఉన్న తెలంగాణా రాష్ట్రం కూడా వేతనాలను అరకొరగా రూ. 14 వేల నుండి రూ. 20 వేల వరకు పెంచింది. కర్నాటక ప్రభుత్వం మే 23న పెంచిన వేతనాల స్థాయి సంతృప్తికరంగా ఉంది. అక్కడ...
Recent posts

వైద్య మిత్రాల జీతాలు వెంటనే చెల్లించాలి.వైద్య మిత్రాల జీతాలు వెంటనే చెల్లించాలి.

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో వైద్యమిత్రాలు టీం లీడర్లు మరియు డిస్ట్రిక్ మేనేజర్లు కలిపి మొత్తం 2000 మంది సిబ్బందపనిచేస్తున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న వీరికి మార్చి నుండి జీతాలు చెల్లించలేదు. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు ఎపి కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. 18 సంవత్సరాల నుండి వీరు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. ఆ జీతాలు నెల నెలా రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలను అధికారులు దృష్టికి ఫోన్ ద్వారా తెలియజేసిన బడ్జెట్ రాలేదని సాకులు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, తక్షణమే స్పందించి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న వైద్యమిత్రాల జీతాలు వెంటనే చెల్లించాలని సిఐటియు ఎపి కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.

2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలి

తేదీ : 28.04.2026 ప్రచురణ / ప్రచురణార్ధం : 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలి మహిళా రిజర్వేషన్ అమలుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో మంగళవారం కా॥ కె.ధనలక్ష్మి అధ్యక్షతన విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, ప్రజా ప్రతినిధులకు రాయభారాలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.సుu్బరావమ్మ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2023 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిందని ఆమె గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం దేశవ్యాప్తంగా మహిళలందరూ సుదీర్ఘకాలం పోరాడారని వామపక్ష పార్టీల ఎంపీలు పార్టీ పార్లమెంట్‌లో గళమెత్తి నినదించారని ఆమె చెప్పారు. ఈ తీర్మానంపై హాజరైన నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుచేసే చిత్తశుద్ధి మోడీ ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించార...

కడియం ఎపి పేపర్ మిల్లు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు సిఐటియు మద్దతు

తేదీ : 28.04.2026 ప్రచురణ / ప్రచురణార్ధం : కడియం ఎపి పేపర్ మిల్లు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు సిఐటియు మద్దతు వేతనాలు పెంచాలని, పర్మినెంట్ చెయ్యాలని కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు కడియం యూనిట్‌లో సుమారు 15 నుండి 20 ఏళ్లుగా పనిచేస్తున్న 850 మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ వేతనాల పెంపు మరియు ఇతర డిమాండ్ పై ఏప్రిల్ 28న ఉదయం నుండి సమ్మె చేస్తున్నారు. గత ఒప్పందం 2023 జూన్ 30తో ముగిసినప్పటికీ, యాజమాన్యం నూతన ఒప్పందం చేయడానికి నిరాకరించింది. యÖనియన్ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఇచ్చినందుకు కక్షతో యÖనియన్ నాయకులకు షోకాజ్ నోటీసులిచ్చి యÖనియన్ నాయకత్వాన్ని రెచ్చగొట్టింది. రోజువారీ వేతనాన్ని రూ.300 మేర పెంచాలని, సీనియార్టీ ప్రాతిపదికన కార్మికులను పర్మినెంట్ చేయాలని, కార్మికులకు 20% బోనస్ మరియు 22% ప్రొడక్షన్ బోనస్ కల్పించాలని కోరారు. వారాంతపు సెలవులకు వేతనం ఇవ్వాలని, ఓవర్ టైంకు డబుల్ వేతనం ఇవ్వాలని, క్యాంటీన్ ధరలను తగ్గించడంతో పాటు, మహిళా కార్మికుల కోసం ప్రత్యేక వాష్ రూమ్ కల్పించాలని డిమాండ్స్ ఇచ్చారు. లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల హక్కులు ప...

సిఐటియు ఏపి కమిటీ 17వ రాష్ట్ర మహాసభలు నంద్యాలలో ఏప్రిల్ 17 నుండి 19 వరకూ జయప్రదంగా జరిగాయి.

సిఐటియు రాష్ట్ర కేంద్రంలో కారల్‌మార్క్స్ 143వ వర్ధంతి

కార్మికవర్గ సిద్ధాంతకర్త, ప్రపంచ మానవాళి కళ్యాణానికి మార్గ దర్శకుడు కారల్‌మార్క్స్ 143వ, వర్ధంతి కార్యక్రమం సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారల్‌మార్క్స్ చిత్ర పటాఇకి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజయకుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు అధ్యక్షతన నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రపంచ మానవాళి విముక్తి సోషలిజం ద్వారానే సాధ్యమని నిరూపించిన మహా మేధావి కారల్‌మార్క్స్ అని సిఐటియు నాయకులు కొనియాడారు. ప్రస్తుతం అమెరికా సామ్రాజ్యవాదం బరితెగించి ఇజ్రాయెల్‌తో కలిపి ఇరాన్‌పై దాడి చేయడం దుర్మార్గ పూరితమని నాయకులు విమర్శించారు. ప్రపంచవ్యాపితంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని, దీని మూలంగా చమురు ధరలు పైకి ఎగబాకుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మానవాళి సమస్యలకు పెట్టుబడిదారీ విధానం పరిష్కారం చూపలేదని సోషలిజం ద్వారానే అది సాధ్యపడుతుందని చెప్పిన మహానీయుడు కారల్‌మార్క్స్ ఆశయ సాధనకు కార్మికవర్గం అంకితం కావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు కె.సుబ్బరావమ్మ, కె.ధనలక్ష్మి, ము...
రాష్ట్ర ప్రభుత్వం షాపులు మరియు సంస్థలకు సంబంధించి రెండు జీఓలు జారీ చేసింది. ఈ జీఓలు వీటిలో పనిచేసే కార్మికులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కూటమి ప్రభుత్వం ఇటువంటి ముఖ్యమైన సమస్యపై కనీసం కార్మిక సంఘాలతో కూడా చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించింది. ఇప్పటికే షాపులు మరియు సంస్థలలో పనిచేసే కార్మికుల పనిగంటలను 8 నుండి 10కి పెంచింది. అదే సమయంలో వారానికి 48 గంటలు పనిచేస్తే సరిపోతుందన్నది. కానీ 10 గంటలు పనిచేస్తే అదనంగా ఒకరోజు సెలవు వస్తుందని మాత్రం ఎక్కడా చెప్పలేదు. కొద్ది కాలంలోనే ఇప్పుడు మరో జీఓ జారీ చేసి షాపులు, సంస్థలను యజమానులు ప్రతిరోజూ 24 గంటలు తెరిచి ఉంచవచ్చని, కార్మికులతో పనిచేయించుకోవచ్చని చెప్పింది. కానీ పని వారానికి 48 గంటలు మాత్రమేనని మళ్లీ ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడింది. వారానికి 48 గంటలు మించితే ఓవర్‌టైమ్ ఇవ్వాలని చెప్పింది. కానీ ఇప్పటికే రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. షాపుల్లో కార్మికులు రోజుకు 8 గంటలకు మించిన పని కాలానికి డబుల్ ఓటీ లేకుండా 10 నుండి 12 గంటలు పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, లేబర్ అధికారులు దీన్ని చూసి చూడనట్లు నటిస్తున్నారు. 24 ...