సిఐటియు అఖిలభారత మహాసభలకు సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న
సిఐటియు అఖిలభారత మహాసభలకు సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న
ఈ కార్యక్రమాలలో భాగస్వాములు కావడానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి హైదరాబాదు నగరంలో ప్రముఖ సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి సుద్దాల అశోక్ తేజ మరియు మరియు ప్రజా కవి, గాయకుడు పాటల రచయిత గోరేటి వెంకన్న లను వారి నివాసంలో కలిసి మహాసభలలో భాగస్వాములు కావాలని, కార్మికోద్యమానికి అండగా నిలవాలని కోరారు.
విశాఖపట్నంలో జరిగే అఖిలభారత మహాసభల కార్యక్రమంలో తాము భాగస్వాములు అవుతామని, సాంస్కృతిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటామని కందారపు మురళికి హామీ ఇచ్చారు. అఖిలభారత మహాసభల కార్యక్రమాలలో తమను భాగస్వాములను చేయటం పట్ల వారు సిఐటియు అఖిలభారత కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు. సిఐటియు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న లకు ఫోనులో అభినందనలు తెలిపారు.
Comments
Post a Comment