Posts

Showing posts from December, 2025

లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మిక వర్గం ఐక్య పోరాటాలు చేయాలి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ వి.గోపాల్ గౌడ పిలుపు

Image
రాజ్యాంగ విరుద్ధమైన, కార్మిక వర్గానికి నష్ట దాయకమైన లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా ఆందోళనలు చేపట్టాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.గోపాల్ గౌడ సందేశమిచ్చారు. ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. డిసెంబర్ 13న విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సిఐటియు అఖిలభారత మహాసభల సందర్భంగా సిఐటియు-ఎంబివికే ఆధ్వర్యంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సులో జస్టిస్ గోపాల్ గౌడ ప్రసంగిస్తూ వంద సంవత్సరాల క్రితం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను పెట్టుబడి దారులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు బేర సారాలు ఆడే హక్కు లేకుండా లేబర్ కోడ్స్ తయారు చేశారని అన్నారు. కార్మికులకు ఎటువంటి పని, సామాజిక భద్రత భవిష్యత్తులో ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు కార్పొరేట్ల సేవలో తరిస్తున్నాయన్నారు. జాతీయ కనీస వేతనం రూ. 178/- రోజుకి ఎలా సరిపోతుందన్నారు. పెరుగుతున్న ధరల...

సెల్ఫ్ వీడియోలతో వినూత్న రీతిలో సిఐటియు అఖిలభారత మహాసభల కోసం ప్రచారం

Image
సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు అనుబంధ సంఘమైన ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెల్ఫ్ వీడియోలతో వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో మహాసభలు కోసం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సిఐటియు అఖిలభారత మహాసభలకు 1,300 మంది ప్రతినిధులు హాజరై పాల్గొంటారు. అందులో ఆశా వర్కర్ వర్కర్స్ యూనియన్ నుండి కూడా ప్రతినిధులు దేశ నలుమూలల నుండి ఈ మహాసభకు వస్తున్నారు. ఇప్పటికే సిఐటియు అనేక కార్మిక సమస్యల కోసం పోరాడటమే కాకుండా ఆశా వర్కర్ల సమస్యలపై కూడా నిరంతరం పోరాటం చేస్తుంది. మన రాష్ట్రంలో ఇప్పటికీ ఆశా వర్కర్ల జీతం 10,000 కు మించడం లేదు. ఒక్కరోజు కూడా సెలవు లేకుండా పనిచేస్తున్న కార్మికులు ఎవరైనా ఉన్నారంటే వారు ఆశా వర్కర్లు మాత్రమే. వీరికి హెల్త్ ఇన్సూరెన్స్ లేవు. అన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఇలాంటి అనేక సమస్యల పైన ఈ మహాసభలు చర్చించి భవిష్యత్తు పోరాటాలకు దిశా ...