కడియం ఎపి పేపర్ మిల్లు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు సిఐటియు మద్దతు
తేదీ : 28.04.2026
ప్రచురణ / ప్రచురణార్ధం :
కడియం ఎపి పేపర్ మిల్లు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు సిఐటియు మద్దతు
వేతనాలు పెంచాలని, పర్మినెంట్ చెయ్యాలని కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్
ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు కడియం యూనిట్లో సుమారు 15 నుండి 20 ఏళ్లుగా పనిచేస్తున్న 850 మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ వేతనాల పెంపు మరియు ఇతర డిమాండ్ పై ఏప్రిల్ 28న ఉదయం నుండి సమ్మె చేస్తున్నారు.
గత ఒప్పందం 2023 జూన్ 30తో ముగిసినప్పటికీ, యాజమాన్యం నూతన ఒప్పందం చేయడానికి నిరాకరించింది. యÖనియన్ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఇచ్చినందుకు కక్షతో యÖనియన్ నాయకులకు షోకాజ్ నోటీసులిచ్చి యÖనియన్ నాయకత్వాన్ని రెచ్చగొట్టింది.
రోజువారీ వేతనాన్ని రూ.300 మేర పెంచాలని, సీనియార్టీ ప్రాతిపదికన కార్మికులను పర్మినెంట్ చేయాలని, కార్మికులకు 20% బోనస్ మరియు 22% ప్రొడక్షన్ బోనస్ కల్పించాలని కోరారు. వారాంతపు సెలవులకు వేతనం ఇవ్వాలని, ఓవర్ టైంకు డబుల్ వేతనం ఇవ్వాలని, క్యాంటీన్ ధరలను తగ్గించడంతో పాటు, మహిళా కార్మికుల కోసం ప్రత్యేక వాష్ రూమ్ కల్పించాలని డిమాండ్స్ ఇచ్చారు. లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల హక్కులు పరిరక్షించాలని కోరారు. వందల కోట్లు లాభాలు ఆర్జిస్తున్నా యాజమాన్యం కార్మికులకు వేతనాలు పెంచకుండా తీవ్రమైన దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము.
వీరి సమ్మెకు సిఐటియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతోంది. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.
(సి.హెచ్.నరసింగరావు)
అధ్యక్షులు
(ఏ.వి.నాగేశ్వరరావు)
ప్రధాన కార్యదర్శి

Comments
Post a Comment