Skip to main content

కడియం ఎపి పేపర్ మిల్లు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు సిఐటియు మద్దతు

తేదీ : 28.04.2026 ప్రచురణ / ప్రచురణార్ధం : కడియం ఎపి పేపర్ మిల్లు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు సిఐటియు మద్దతు వేతనాలు పెంచాలని, పర్మినెంట్ చెయ్యాలని కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు కడియం యూనిట్‌లో సుమారు 15 నుండి 20 ఏళ్లుగా పనిచేస్తున్న 850 మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ వేతనాల పెంపు మరియు ఇతర డిమాండ్ పై ఏప్రిల్ 28న ఉదయం నుండి సమ్మె చేస్తున్నారు. గత ఒప్పందం 2023 జూన్ 30తో ముగిసినప్పటికీ, యాజమాన్యం నూతన ఒప్పందం చేయడానికి నిరాకరించింది. యÖనియన్ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఇచ్చినందుకు కక్షతో యÖనియన్ నాయకులకు షోకాజ్ నోటీసులిచ్చి యÖనియన్ నాయకత్వాన్ని రెచ్చగొట్టింది. రోజువారీ వేతనాన్ని రూ.300 మేర పెంచాలని, సీనియార్టీ ప్రాతిపదికన కార్మికులను పర్మినెంట్ చేయాలని, కార్మికులకు 20% బోనస్ మరియు 22% ప్రొడక్షన్ బోనస్ కల్పించాలని కోరారు. వారాంతపు సెలవులకు వేతనం ఇవ్వాలని, ఓవర్ టైంకు డబుల్ వేతనం ఇవ్వాలని, క్యాంటీన్ ధరలను తగ్గించడంతో పాటు, మహిళా కార్మికుల కోసం ప్రత్యేక వాష్ రూమ్ కల్పించాలని డిమాండ్స్ ఇచ్చారు. లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల హక్కులు పరిరక్షించాలని కోరారు. వందల కోట్లు లాభాలు ఆర్జిస్తున్నా యాజమాన్యం కార్మికులకు వేతనాలు పెంచకుండా తీవ్రమైన దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము. వీరి సమ్మెకు సిఐటియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతోంది. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. (సి.హెచ్.నరసింగరావు) అధ్యక్షులు (ఏ.వి.నాగేశ్వరరావు) ప్రధాన కార్యదర్శి

Comments

Popular posts from this blog

సామాజిక శంఖారావం అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను పరిష్కరించాలి

సామాజిక శంఖారావం అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను పరిష్కరించాలి మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి సామాజిక శంఖారావం బృందం వినతి అమరావతి: “సామాజిక శంఖారావం – కులవివక్ష లేని సమాజం కోసం” నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సామాజిక శంఖారావం ప్రతినిధి బృందం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిని మంగళవారం కలిసి రాష్ట్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 380 మండలాలు, 1,243 గ్రామాలు, 63 పట్టణాలు, 236 వార్డుల్లో నిర్వహించిన అధ్యయన యాత్రల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ అధ్యయనంలో 660 స్మశాన వాటిక సమస్యలు, 405 ఇళ్ల స్థలాల సమస్యలు, 302 భూ సంబంధిత సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. స్మశాన వాటికలకు శాశ్వత పరిష్కారం అధ్యయన యాత్రల్లో అత్యధికంగా వెలుగులోకి వచ్చిన సమస్య స్మశాన వాటికలేనని ప్రతినిధులు తెలిపారు. అనేక దళితవాడల్లో ప్రత్యేక స్మశాన స్థలాలు లేకపోవడ...

ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) నూతన రాష్ట్ర కమిటీ

అధ్యక్ష–ప్రధానకార్యదర్శులుగా కె.నాగభూషణం - కె.ఉమామహేశ్వర రావు - 21 మంది ఆఫీస్ బేరర్స్ ఎన్నిక - మరో 50 మందితో రాష్ట్ర కమిటీ. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా కె నాగభూషణం, కె ఉమామహేశ్వరరావు తిరిగి ఎన్నికయ్యారు.మునిసిపల్  వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 15వ రాష్ట్ర మహాసభలు ఒంగోలు కొత్త మార్కెట్ వద్ద  జి.సుబ్బారావు నగర్‌లో నవంబర్ 15–16 తేదీల్లో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు మున్సిపల్ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర చర్చలు జరిపిన ఈ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభలకు తొలి రోజు ఎంఎల్ సి బి గోపిమూర్తి, నిన్న ఈ రోజు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ముఖ్య అతిధులు గా హాజరై శ్రేణులకు దశ, దిశా నిర్దేశం చేశారు. కాగా ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, ఎ పి మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు, ఎపి మధ్యాహ్న భోజన పధక కార్మికుల యూనియన్, కెవిపిఎస్ యూనియన్ రాష్ట్ర నాయకులు పి కల్పన, బి రఘురామ్ స...

సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు

అనంతపురం:  హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గమని, అప్పుడే ప్రభుత్వాలు స్పందిస్తాయని సివిల్‌ సప్లరు హామాలీ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సప్లయ్ హమాలీ యూనియన్‌ ఐదవ రాష్ట్ర మహాసభ అనంతపురం జిల్లా కేంద్రంలోని గణేనాయక్‌ భవన్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. సీతారాం ఏచూరి ప్రాంగణంలో సిఐటియు జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.కృష్ణ అధ్యక్షతన ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా గేయానంద్‌, ఆ సంఘం గౌరవాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. తొలుత అమరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా మహాసభ నివాళులర్పించింది. మూడు సంవత్సరాల్లో సంఘం ఆధ్వర్యంలో హమాలీల పక్షాన చేసిన పోరాటాలు, సాధించిన హక్కులు తదితర అంశాలపై ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరరావు నివేదిక ప్రవేశపెట్టారు. గేయానంద్‌, కె.ఉమామహేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మాట్లాడుతూ… సివిల్‌ సప్లరు హమాలీల శ్రమకు తగ్గ వేతనం అందడం లేదన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత క...