డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో వైద్యమిత్రాలు టీం లీడర్లు మరియు డిస్ట్రిక్ మేనేజర్లు కలిపి మొత్తం 2000 మంది సిబ్బందపనిచేస్తున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న వీరికి మార్చి నుండి జీతాలు చెల్లించలేదు. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు ఎపి కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. 18 సంవత్సరాల నుండి వీరు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. ఆ జీతాలు నెల నెలా రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలను అధికారులు దృష్టికి ఫోన్ ద్వారా తెలియజేసిన బడ్జెట్ రాలేదని సాకులు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, తక్షణమే స్పందించి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న వైద్యమిత్రాల జీతాలు వెంటనే చెల్లించాలని సిఐటియు ఎపి కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
అధ్యక్ష–ప్రధానకార్యదర్శులుగా కె.నాగభూషణం - కె.ఉమామహేశ్వర రావు - 21 మంది ఆఫీస్ బేరర్స్ ఎన్నిక - మరో 50 మందితో రాష్ట్ర కమిటీ. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా కె నాగభూషణం, కె ఉమామహేశ్వరరావు తిరిగి ఎన్నికయ్యారు.మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 15వ రాష్ట్ర మహాసభలు ఒంగోలు కొత్త మార్కెట్ వద్ద జి.సుబ్బారావు నగర్లో నవంబర్ 15–16 తేదీల్లో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు మున్సిపల్ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర చర్చలు జరిపిన ఈ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభలకు తొలి రోజు ఎంఎల్ సి బి గోపిమూర్తి, నిన్న ఈ రోజు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ముఖ్య అతిధులు గా హాజరై శ్రేణులకు దశ, దిశా నిర్దేశం చేశారు. కాగా ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, ఎ పి మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు, ఎపి మధ్యాహ్న భోజన పధక కార్మికుల యూనియన్, కెవిపిఎస్ యూనియన్ రాష్ట్ర నాయకులు పి కల్పన, బి రఘురామ్ స...

Comments
Post a Comment