50 లక్షల మంది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 2006 - 07 తర్వాత కనీస వేతనాలను పెంచలేదు. ఐదు సంవత్సరాýకోసారి కనీస వేతనాల చట్టం ప్రకారం వేతనాలు పెంచాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను పెంచితే యాజమాన్యాలకు లాభాలు తగ్గిపోతాయని కనీస వేతనాలను పెంచలేదు. షెడ్యూల్డ్ పరిశ్రమల్లోని కార్మికులకు కోట్లాది రూపాయలు నష్టం కలిగించింది. 2012, 2017, 2022లో కనీస వేతనాలను పెంచకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారుల ప్రయోజనం కోసమే పని చేశాయి. మన పక్కనే ఉన్న తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలు ఐదు సంవత్సరాల కోసారి వేతనాలు పెంచుతున్నాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి కార్మికుల ప్రయోజనం పట్టదు. ఎప్పుడు కూడా పెట్టుబడిదారులకు ఏమి లబ్ది చేకూర్చాలని మాత్రమే ఆలోచిస్తున్నది.
ఐదు సంవత్సరాలకోసారి వేతనాలు పెంచినట్లయితే కనీస స్థాయిలో ఈ పాటికి రూ. 19 వేల నుండి రూ. 22 వేల వరకూ వచ్చి ఉండేవి. నైపుణ్య స్థాయిని బట్టి మరింతగా వేతనాలు పెరిగి ఉండేవి. మన పక్కనే ఉన్న తెలంగాణా రాష్ట్రం కూడా వేతనాలను అరకొరగా రూ. 14 వేల నుండి రూ. 20 వేల వరకు పెంచింది. కర్నాటక ప్రభుత్వం మే 23న పెంచిన వేతనాల స్థాయి సంతృప్తికరంగా ఉంది. అక్కడి కార్మికుల వేతనాలు రూ. 20,350 నుండి రూ. 32,145 వరకు పెరిగాయి. కేరళలో గత వామపక్ష ప్రభుత్వం గతంలోనే దేశంలోనే అత్యధికంగా కనీస వేతనాలను పెంచింది.
షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్లోని 50 లక్షల మంది కార్మికులకు మరియు ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లకు భారత కార్మిక మహాసభ సిఫార్శులు మరియు 1992 సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కనీస స్థాయిలో వేతనాన్ని నెలకు రూ. 26 వేలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియు ఏపి కమిటీ డిమాండ్ చేస్తున్నది. వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రారంభ వేతనం నెలకు రూ.26 వేలు చేయాలని సిఐటియు ఏపి కమిటీ డిమాండ్ చేస్తున్నది. న్యాయమైన ఈ కనీస వేతనాల సాధనకు కార్మికులంతా ఒక గట్టి పోరాటానికి సిద్ధం కావాలని కోరుతున్నది.
అధ్యక్ష–ప్రధానకార్యదర్శులుగా కె.నాగభూషణం - కె.ఉమామహేశ్వర రావు - 21 మంది ఆఫీస్ బేరర్స్ ఎన్నిక - మరో 50 మందితో రాష్ట్ర కమిటీ. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా కె నాగభూషణం, కె ఉమామహేశ్వరరావు తిరిగి ఎన్నికయ్యారు.మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 15వ రాష్ట్ర మహాసభలు ఒంగోలు కొత్త మార్కెట్ వద్ద జి.సుబ్బారావు నగర్లో నవంబర్ 15–16 తేదీల్లో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు మున్సిపల్ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర చర్చలు జరిపిన ఈ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభలకు తొలి రోజు ఎంఎల్ సి బి గోపిమూర్తి, నిన్న ఈ రోజు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ముఖ్య అతిధులు గా హాజరై శ్రేణులకు దశ, దిశా నిర్దేశం చేశారు. కాగా ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, ఎ పి మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు, ఎపి మధ్యాహ్న భోజన పధక కార్మికుల యూనియన్, కెవిపిఎస్ యూనియన్ రాష్ట్ర నాయకులు పి కల్పన, బి రఘురామ్ స...

Comments
Post a Comment