50 లక్షల మంది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 2006 - 07 తర్వాత కనీస వేతనాలను పెంచలేదు. ఐదు సంవత్సరాýకోసారి కనీస వేతనాల చట్టం ప్రకారం వేతనాలు పెంచాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను పెంచితే యాజమాన్యాలకు లాభాలు తగ్గిపోతాయని కనీస వేతనాలను పెంచలేదు. షెడ్యూల్డ్ పరిశ్రమల్లోని కార్మికులకు కోట్లాది రూపాయలు నష్టం కలిగించింది. 2012, 2017, 2022లో కనీస వేతనాలను పెంచకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారుల ప్రయోజనం కోసమే పని చేశాయి. మన పక్కనే ఉన్న తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలు ఐదు సంవత్సరాల కోసారి వేతనాలు పెంచుతున్నాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి కార్మికుల ప్రయోజనం పట్టదు. ఎప్పుడు కూడా పెట్టుబడిదారులకు ఏమి లబ్ది చేకూర్చాలని మాత్రమే ఆలోచిస్తున్నది.
ఐదు సంవత్సరాలకోసారి వేతనాలు పెంచినట్లయితే కనీస స్థాయిలో ఈ పాటికి రూ. 19 వేల నుండి రూ. 22 వేల వరకూ వచ్చి ఉండేవి. నైపుణ్య స్థాయిని బట్టి మరింతగా వేతనాలు పెరిగి ఉండేవి. మన పక్కనే ఉన్న తెలంగాణా రాష్ట్రం కూడా వేతనాలను అరకొరగా రూ. 14 వేల నుండి రూ. 20 వేల వరకు పెంచింది. కర్నాటక ప్రభుత్వం మే 23న పెంచిన వేతనాల స్థాయి సంతృప్తికరంగా ఉంది. అక్కడి కార్మికుల వేతనాలు రూ. 20,350 నుండి రూ. 32,145 వరకు పెరిగాయి. కేరళలో గత వామపక్ష ప్రభుత్వం గతంలోనే దేశంలోనే అత్యధికంగా కనీస వేతనాలను పెంచింది.
షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్లోని 50 లక్షల మంది కార్మికులకు మరియు ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లకు భారత కార్మిక మహాసభ సిఫార్శులు మరియు 1992 సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కనీస స్థాయిలో వేతనాన్ని నెలకు రూ. 26 వేలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియు ఏపి కమిటీ డిమాండ్ చేస్తున్నది. వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రారంభ వేతనం నెలకు రూ.26 వేలు చేయాలని సిఐటియు ఏపి కమిటీ డిమాండ్ చేస్తున్నది. న్యాయమైన ఈ కనీస వేతనాల సాధనకు కార్మికులంతా ఒక గట్టి పోరాటానికి సిద్ధం కావాలని కోరుతున్నది.
సామాజిక శంఖారావం అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను పరిష్కరించాలి మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి సామాజిక శంఖారావం బృందం వినతి అమరావతి: “సామాజిక శంఖారావం – కులవివక్ష లేని సమాజం కోసం” నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సామాజిక శంఖారావం ప్రతినిధి బృందం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిని మంగళవారం కలిసి రాష్ట్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 380 మండలాలు, 1,243 గ్రామాలు, 63 పట్టణాలు, 236 వార్డుల్లో నిర్వహించిన అధ్యయన యాత్రల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ అధ్యయనంలో 660 స్మశాన వాటిక సమస్యలు, 405 ఇళ్ల స్థలాల సమస్యలు, 302 భూ సంబంధిత సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. స్మశాన వాటికలకు శాశ్వత పరిష్కారం అధ్యయన యాత్రల్లో అత్యధికంగా వెలుగులోకి వచ్చిన సమస్య స్మశాన వాటికలేనని ప్రతినిధులు తెలిపారు. అనేక దళితవాడల్లో ప్రత్యేక స్మశాన స్థలాలు లేకపోవడ...

Comments
Post a Comment