రాష్ట్ర ప్రభుత్వం షాపులు మరియు సంస్థలకు సంబంధించి రెండు జీఓలు జారీ చేసింది. ఈ జీఓలు వీటిలో పనిచేసే కార్మికులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కూటమి ప్రభుత్వం ఇటువంటి ముఖ్యమైన సమస్యపై కనీసం కార్మిక సంఘాలతో కూడా చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించింది. ఇప్పటికే షాపులు మరియు సంస్థలలో పనిచేసే కార్మికుల పనిగంటలను 8 నుండి 10కి పెంచింది. అదే సమయంలో వారానికి 48 గంటలు పనిచేస్తే సరిపోతుందన్నది. కానీ 10 గంటలు పనిచేస్తే అదనంగా ఒకరోజు సెలవు వస్తుందని మాత్రం ఎక్కడా చెప్పలేదు.
కొద్ది కాలంలోనే ఇప్పుడు మరో జీఓ జారీ చేసి షాపులు, సంస్థలను యజమానులు ప్రతిరోజూ 24 గంటలు తెరిచి ఉంచవచ్చని, కార్మికులతో పనిచేయించుకోవచ్చని చెప్పింది. కానీ పని వారానికి 48 గంటలు మాత్రమేనని మళ్లీ ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడింది. వారానికి 48 గంటలు మించితే ఓవర్టైమ్ ఇవ్వాలని చెప్పింది. కానీ ఇప్పటికే రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. షాపుల్లో కార్మికులు రోజుకు 8 గంటలకు మించిన పని కాలానికి డబుల్ ఓటీ లేకుండా 10 నుండి 12 గంటలు పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, లేబర్ అధికారులు దీన్ని చూసి చూడనట్లు నటిస్తున్నారు. 24 గంటలూ సంస్థలు, షాపులు తెరిచి ఉన్నట్లయితే 8 గంటల పని విధానం ప్రకారం మూడు షిప్ట్లు ఉండాలి. ఇప్పుడు కనీసం ఆ పద్ధతిని కూడా పేర్కొనకుండా పని చేయమనడం కార్మికులను కట్టుబానిసలుగా మార్చడానికే. 48 గంటలు దాటితే ఓటీకి అర్హత ఉంటుందని చెప్పడం కార్మికులను మోసపుచ్చడానికే.
షాపులు, సంస్థలకు రిజిస్ట్రేషన్ రెన్యువల్స్ లేకుండా కేవలం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలని చెప్పడం కూడా కార్మిక చట్టాలు పాటించని యజమానులను రక్షించడానికే. షాపులు, ఫ్యాక్టరీలు మినహా మిగతావన్నీ సంస్థల క్రిందకు వస్తాయి. బార్లు, హోటల్స్ తదితరాలన్నీ కూడా దీని క్రిందకు వస్తాయి. అపారమైన సంఖ్యలో ఉన్న కార్మికులను దోపిడీ చేసుకుని యజమానులు తమ వ్యాపారాలను తేలిక చేసుకునేందుకు, వేగంగా చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కార్మికుల ప్రయోజనాలు దానికి పూచిక పుల్లగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులు కూటమి ప్రభుత్వ విధానాలను ఎదురించి పోరాడాలని, 8 గంటల పని విధానాన్ని రక్షించుకోవాలని కోరుతున్నాము. ఈ రెండు జీఓ లను వెంటనే ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
సామాజిక శంఖారావం అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను పరిష్కరించాలి మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి సామాజిక శంఖారావం బృందం వినతి అమరావతి: “సామాజిక శంఖారావం – కులవివక్ష లేని సమాజం కోసం” నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సామాజిక శంఖారావం ప్రతినిధి బృందం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిని మంగళవారం కలిసి రాష్ట్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 380 మండలాలు, 1,243 గ్రామాలు, 63 పట్టణాలు, 236 వార్డుల్లో నిర్వహించిన అధ్యయన యాత్రల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ అధ్యయనంలో 660 స్మశాన వాటిక సమస్యలు, 405 ఇళ్ల స్థలాల సమస్యలు, 302 భూ సంబంధిత సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. స్మశాన వాటికలకు శాశ్వత పరిష్కారం అధ్యయన యాత్రల్లో అత్యధికంగా వెలుగులోకి వచ్చిన సమస్య స్మశాన వాటికలేనని ప్రతినిధులు తెలిపారు. అనేక దళితవాడల్లో ప్రత్యేక స్మశాన స్థలాలు లేకపోవడ...

Comments
Post a Comment