విశాఖస్టీల్ ప్లాంట్లో జూన్ 8 న జరిగిన ప్రమాదానికి బాధ్యులైన స్టీల్ప్లాంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మంగళవారం (23.06.2026)న ఫ్యాక్టరీ డైరెక్టర్ను కలసి సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డిమాండ్ చేశారు. స్టీల్ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు మరణించారు. ఈ ఘటనపై ఉక్కు మంత్రిత్వ శాఖ ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది, కానీ ఇప్పటివరకు ఎలాంటి నివేదిక ప్రకటించలేదు. ఫ్యాక్టరీల శాఖ కూడా ఈ ప్రమాదానికి గల కారణాలను నేటికీ వెల్లడించకపోవడం అన్యాయం. యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని ట్రేడ్ యూనియన్లు మరియు కార్మికులు నిస్సందేహంగా ప్రకటించారు. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఇనుప ద్రావణం ఉండే లాడిల్కు కనీసం కవర్ను కూడా ఉపయోగించలేదు. విధి విధానాల ప్రకారం ప్రమాదానికి ఆస్కారం ఉండే ప్రతీ డిపార్ట్మెంట్లో అంబులెన్స్లు ఉండాలి. ప్రమాదం జరిగిన రోజున ఎసఎంఎస్`1 వద్ద అంబులెన్స్ కూడా లేదు. తక్షణ చికిత్స కోసం =IచీL ఆసుపత్రిలో కాలిన గాయాలకు చికిత్స చేసే యూనిట్ పనిచేయడం లేదు. భద్రతపై 1.12.2025న ఫ్యాక్టరీల జాయింట్ డైరెక్టర్ జారీ చేసిన మెరుగుదల నోటీసునిచ్చినా యాజమాన్యం పట్టించుకోలే...
Official account of the Centre of Indian Trade Unions (CITU), Andhra Pradesh State Committee.