రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ తిరిగి కొనసాగించవచ్చంటూ నిన్న సర్క్యులర్ మెమోను జారీ చేసింది. ఈ సర్క్యులర్ మెమోను జారీ చేయడానికి కూటమి ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీఓ 114, ది. 21.10.2023 ప్రకారం రెగ్యులర్ కాకుండా మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ వెంటనే రెగ్యులర్ చేయాలని సిఐటియు ఏపి కమిటీ కోరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్లే ఈ ఉద్యోగులు రెగ్యులరైజ్ కానందు వల్ల వారికి అప్పటి నుండి ఎరియర్స్ను చెల్లించాలని, సర్వీసు కాలాన్ని పరిగణించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. అభివృద్ధి పేరిట పెట్టుబడిదారులకు ప్రయోజనాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న ఉత్సాహం ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలను కొనసాగించడంలో చూపించడం లేదు. కార్మికుల పనిగంటలు పెంచడం, పని విస్తృతి పెంచడం, మహిళల చేత రాత్రిపూట పని చేయించడం వంటి కార్మిక చట్టాల మార్పులను కూటమి ప్రభుత్వం ఆఘ మేఘాల మీద చేసింది. పెట్టుబడిదారులకు ప్రయోజనాలు కల్పించడంలో చూపిన వేగం 3 లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మినిమం టైమ్స్కేల్ అమలు చేయడంలో చూపడ...
Official account of the Centre of Indian Trade Unions (CITU), Andhra Pradesh State Committee.